సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి.. ఓపిక పట్టాలి: నయనతార భర్త విఘ్నేష్ శివన్
Nayanthara: స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులు పిల్లల్ని కనడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వీరు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కన్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, మన దేశంలో కమర్షియల్ సరోగసీ విధానాన్ని నిషేధించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సరోగసీ చట్టం ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సరోగసీ ద్వారా పిల్లల్ని పొందొచ్చు. మరి ఈ నిబంధనలను అనుసరించే నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు కవల పిల్లల్ని పొందారా అనేది ప్రశ్నార్థకం. దీనిపై తమిళనాడు వైద్యారోగ్య శాఖ కూడా వివరణ కోరనుంది.
Comments
Post a Comment