Rana Daggubati : స్థల వివాదం.. సిటీ సివిల్ కోర్టుకి హాజరైన హీరో రానా దగ్గుబాటి
హీరో రానా కోర్టు మెట్లెక్కారు. గత కొన్నాళ్లుగా వీరికి సంబంధించిన భూ వివాదంపై కేసు నడుస్తోంది. దీనికి సంబంధించిన కేసులోనే రానా దగ్గుబాటి కోర్టుకి హాజరయ్యారు.ఫిలింనగర్లో తమ భూమిని లీజుకి ఇచ్చారు. లీజు కొనసాగుతుండగానే ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేశారు. దీనిపై పిటిషన్ దాఖలైంది. కేసు కోర్టులో ఉన్నప్పటికీ కోర్టు ధిక్కరణ చేసి దగ్గుపాటి సురేష్ తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు న్యాయస్థానం దృష్టికి రావటంతో కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.
Comments
Post a Comment