TDP పార్టీ మార్పుపై మురళీమోహన్ కీలక నిర్ణయం.. ఆ పార్టీ తరుపున ప్రచారం
Janasena: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది సాధిస్తారని.. ఏనాటికైనా ముఖ్యమంత్రి కావడం ఖాయం అని జోస్యం చెప్పారు సీనియర్ నటుడు, టీడీపీ ఎంపీ మురళీమోహన్. కొంతమందిలా పార్టీ పెట్టి జెండా ఎత్తేసే టైం పవన్ కళ్యాణ్ కాదని.. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారంటూ ధీమా వ్యక్తం చేశారాయన. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న మురళీమోహన్ పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపించడంతో ఆయన జనసేనలోకి వెళ్లబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు.
Comments
Post a Comment