సీనియర్ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తెలుగు చిత్రసీమకు చెందిన సీనియర్ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపై టాలీవుడ్ పరిశ్రమ సంతాపాన్ని ప్రకటించింది. ఈయన మాధవి పిక్చర్స్ అనే బ్యానర్ను స్టార్ట్ చేసి దొరబాబు, సుపుత్రుడు, కురుక్షేత్రం, ఆటగాడు వంటి చిత్రాలను నిర్మించారు. అలాగే మరో దివంగత సీనియర్ నిర్మాత.. మూవీ మొఘల్ డి.రామానాయుడుతో కలిసి పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు.
Comments
Post a Comment