సిరివెన్నెల టాలెంట్‌ గుర్తించింది మొదట ఆయనే.. చిన్నప్పటి సీతారామశాస్త్రి కోరిక అదే!!

తెలుగు సినీ పాటను, అందులోని మాధుర్యాన్ని ప్రపంచానికి వినిపించి మన్ననలు పొందారు . ఆయన కలం నుంచి లిఖించబడ్డ ప్రతి అక్షరం సగటు ప్రేక్షకుడి నరనరాన ఇమిడిపోయింది. 3000లకు పైగా పాటలు రాసిన ఆయనను 11 సార్లు నంది అవార్డ్‌ వరించింది. ఉత్తమ గేయ రచయితగా 4 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. పలు సినిమాల్లో ఆర్టిస్ట్‌ గానూ మెరిశారు. అలాంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. సినీ లోకమంతా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతోంది. అయితే సీతారామ శాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామ శాస్త్రికి పాటలు పాడాలనే కోరిక ఉదేదట. అయితే పాడటానికి ప్రయత్నించి, అందుకు తాను పనికిరానని నిర్ధారణకు వచ్చిన సీతారామ శాస్త్రి టాలెంట్ మొదట ఆయన సోదరుడు గుర్తించాడట. వెంటనే ఆయనకు ఓ సలహా ఇచ్చారట. అన్నయ్యా.. ఎప్పుడూ కొత్త పదాలతో ఏదో ఒకటి పాడుతున్నావు.. కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. సాహిత్యం దిశగా ప్రయత్నించు అని చెప్పి ప్రోత్సహించారట. దీంతో ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌ బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారట సీతారామ శాస్త్రి. అప్పట్లో సీతారామ శాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారట. ఆయన MA చేస్తున్న రోజుల్లో దర్శకుడు కె.విశ్వనాథ్‌ నుంచి పిలుపు రావటంతో తెలుగు చిత్రసీమ కోసం ఈ ‘సిరివెన్నెల’ కదిలింది. అలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే ఎన్నో సుమధుర గీతాలను రాశారు సిరివెన్నెల.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

హిమాలయాల్లో ‘వైల్డ్ డాగ్’.. టీమ్‌తో కలిసి పోరాటాలు