ఇకలేరు అంటే.. ఎలా..? సిరివెన్నెల మరణంపై సింగర్ సునీత ఎమోషనల్ కామెంట్స్

సినిమా పాటలో తనదైన శైలిలో సాహిత్యాన్ని మేళవించి మెప్పించిన ప్రముఖ గేయ రచయిత ఇకలేరని తెలిసి యావత్ సినీ లోకం షాకైంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. సాహిత్య దిగ్గజం మృతితో టాలీవుడ్ సర్కిల్స్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాళా తపస్వి కె. విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ రియాక్ట్ అవుతూ సిరివెన్నెల కుటుంబానికి తమ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తాజాగా స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ''తరలిపోయింది వసంతం.. ఈవేళలో నుండి చివరకు మిగిలేదీ వరకు సిరివెన్నెల (నాకు బాబాయి) గారు రాసిన ప్రతి పాటా ఎంతో గర్వంగా పాడాను. ఇక లేరు అంటే.. ఎలా?'' అంటూ సిరివెన్నెల ఫొటో షేర్ చేస్తూ ఇన్స్‌స్టాలో పోస్ట్ పెట్టారు సునీత. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాల ప్ర‌యాణంలో సిరివెన్నెల క‌లం ఎప్పుడూ అలుపెర‌గ‌లేదు. వేలాది పాట‌లు రాసి ప్రేక్ష‌కుల గుండెల్లో తన ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌తో, స్పూర్తితో జ్వాల‌ను ర‌గిల్చిన నిత్య చిరంజీవి సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. మ‌హామ‌హులు పోటీ ప‌డుతున్న కాలంలో వ‌చ్చి రావడంతోనే హ్యాట్రిక్ నందుల‌ను సొంతం చేసుకొని సీనియ‌ర్ రైట‌ర్ వేటూరికి ప్ర‌త్యామ్నాయంగా నిలిచిన దిగ్గ‌జం సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న డాక్టర్ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించిన సీతారామ శాస్త్రి.. కాకినాడలో ఇంటర్మీడియెట్‌ వరకు చదివి ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో బిఏ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలంపాటు టెలిఫోన్స్‌ శాఖలో పని చేశారు. కె. విశ్వనాథ్ అవకాశం కల్పించడంతో 'సిరివెన్నెల' సినిమాలో పాటలన్నీ రాశారు. అప్పటినుంచి ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా టాలీవుడ్‌లో స్థిరపడ్డారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ