ఒళ్లో తలవాల్చి సేద తీరుతోన్న బ్యూటీ.. పూజా హెగ్డే హల్చల్

బుట్టబొమ్మ ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడపడం ఇష్టంగా ఫీలవుతుంది. అలా గతేడాది లాక్డౌన్ సమయంలో ఇంటి సభ్యులందరితో కలిసి పూజా హెగ్డే చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. కజిన్స్, సోదరులు, గ్రాండ్ పేరెంట్స్ ఇలా అందరితో కలిసి పూజా హెగ్డే రచ్చ రచ్చ చేశారు. ఇక ఆ మధ్య పూజా హెగ్డే బామ్మ మరణించడంతో ఎంతో ఎమోషనల్ అయ్యారు. బామ్మను తలుచుకుంటూ పూజా హెగ్డే చేసిన పోస్ట్ అందరినీ కదిలిచింది. ఇప్పుడు పూజా హెగ్డే ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా లాక్డౌన్‌ను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక సెలెబ్రిటీలు గతేడాది మాదిరిగానే ఇంట్లో ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నీ మధ్య పూజా హెగ్డే వంటింట్లోకి దూరి తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక తాజాగా పూజా హెగ్డే తన అమ్మమ్మ ఒళ్లో సేదతీరుతోన్నారు. ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. బేసిగ్గా మనకు కావాల్సింది కూడా ఇదే అంటూ ప్రేమలో మునిగిపోతోన్నారు. ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా తల్లి కూతురే.. బామ్మకు మనవరాలే కదా. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, చిరంజీవి రామ్ చరణ్ ఆచార్య, అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాలు వరుసగా లైన్‌లో ఉన్నాయి. ఇక బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డే పలు ప్రాజెక్ట్‌లలో ఎంపికయ్యారు. ఏకంగా సల్మాన్ ఖాన్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేశారు. దళపతి విజయ్ పక్కన హీరోయిన్‌గానూ ఎంపికయ్యారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ