క్షమించడం.. అందరి క్షేమం కోసం క్యాన్సిల్ చేయక తప్పలేదు: సింగర్ సునీత పోస్ట్

వివాహం తరువాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారు సింగర్ . తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు సింగర్‌‌గా ప్రొఫెషనల్ అప్డేట్స్‌ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా తన మ్యూజికల్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది . శనివారం నాడు హైదరాబాద్‌లోని పీపుల్ ప్లాజాలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఆధ్వర్యంలో ‘మణిశర్మ మ్యూజికల్ నైట్’ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సింగర్ సునీతతో పాటు గీతామాధురి, రమ్య, సాహితి, రేవంత్, అనురాగ్ కులకర్ణి, శ్రీక్రిష్ణ, సాకేత్ తదితర గాయకులు పాల్గొనాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ మ్యూజిక్ కన్సర్ట్‌ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. అభిమానులకు క్షమాపణలు తెలియజేసింది సింగర్ సునీత. అందరి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని.. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు సింగర్ సునీత.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ