కడుపే కదా మళ్లీ వస్తుందిలే అనుకున్నా.. చివరికి పిల్లల్లేకుండా పోయారు: నటి శ్రీలక్ష్మి

నా జీవితంలో ఆనందానికి, విషాదానికి నేనే జవాబు దారీ అంటున్నారు సీనియర్ నటి, లేడీ కమెడియన్, హీరోయిన్ శ్రీలక్ష్మి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్న తన తండ్రి మరణానికి గల కారణం? ఆయన ఎందుకు చనిపోయారు? ఎవరు మోసం చేశారు అన్న విషయాలను బయటపెట్టారు. తన జీవితం గురించి ఆలోచిస్తే.. తప్పుచేశాననే ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. నాకంటూ ఫ్యామిలీ బాండింగ్ లేకుండా పోయిందే అని బాధ వెంటాడుతుందని అన్నారు శ్రీలక్ష్మి. దేవుడు ప్రతి ఒక్కరికీ ఒక కొరత పెడతాడు. ఎలాంటి కొరత లేదు అంటే వాడు మనిషే కాదు.. నాకైతే దేవుడు పిల్లలు లేకుండా చేశాడు. నేను నా సుఖాన్ని చూసుకుని వెళ్లిపోవడం కరెక్ట్ కాదని ఆలోచించి.. బాధ్యతలు బరువులు తీసుకుని పిల్లలు ఏం ఉందిలే కావాలనుకుంటే మళ్లీ కనొచ్చని అనుకున్నాను. కడుపే కదా మళ్లీ వస్తుందిలే అనుకున్నా.. కానీ తల్లకిందులైనా సరే మళ్లీ తల్లిని కాలేకపోయా. స్పైరల్ ఆపరేషన్ జరిగింది.. థైరాయిడ్ వచ్చేసింది.. ఏజ్ పెరిగిపోయి చాలా ఇబ్బందులు వచ్చేశాయి. దీంతో ఆ ఆనందానికి ఫుల్ స్టాప్ పెట్టేశా. ఆరోజుల్లో ఆర్టిస్ట్‌లు త్యాగం చేయడానికి ప్రాణం ఇచ్చేవాళ్లు.. ఈరోజుల్లో అలా ఏం లేదు’ అంటూ తన పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకున్నారు నటి శ్రీలక్ష్మి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ